byసూర్య | Wed, Aug 17, 2022, 12:37 PM
శంకరపట్నం మండల కేంద్రానికి చేరుకున్న మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్ పాదయాత్రను మండల పరిధిలోని తాడికల్ గ్రామ చివరలో పార్టీ శ్రేణులు ఘన స్వాగతం పలికి సెలవులతో సన్మానించారు. అనంతరం కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు బసవయ్య, మాజీ జెడ్పిటిసి శ్రీనివాస్ గౌడ్ ల ఆధ్వర్యంలో తాడికల్ నుండి శంకరపట్నం మీదుగా అధిక సంఖ్యలో పాదయాత్ర నిర్వహించి అనంతరం శంకర పట్నం శివారులోని శ్రీ లక్ష్మి ప్రసన్న ఫంక్షన్ హాల్ లో విలేకర్ల సమావేశంలో మాట్లాడుతూ దేశంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు నిత్యవసర సరుకుల ధరలు పెంచి సామాన్య ప్రజలకు నిరుపేదల నడ్డి విరిగేలా వ్యవహరిస్తున్నారని మండిపడ్డ మాజీ ఎంపీ పొన్నం.