byసూర్య | Wed, Aug 17, 2022, 12:36 PM
జగిత్యాల జిల్లా ధర్మపురి మండలం తుమ్మెనాల గ్రామంలో పాముకాటుతో మంగళవారం ఓ వృద్ధుడు మృతి చెందాడు. గ్రామానికి చెందిన గోలివాడ ధర్మయ్య ఇంట్లోనే ఉండగా పాము వచ్చి కాటు వేసింది. ఇది గమనించిన కుటుంబ సభ్యులు వెంటనే చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గమధ్యలోనే మృతి చెందాడు. మృతుడి భార్య లక్ష్మి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ కిరణ్ కుమార్ వెల్లడించారు.