byసూర్య | Wed, Aug 17, 2022, 12:37 PM
రాజన్న సిరిసిల్ల జిల్లా తంగళ్ళపల్లి చెందిన ఓ వ్యక్తి భార్యను అతికిరాతకంగా గొంతు కోసి చంపిన భర్తను అరెస్టు చేసినట్లు సీఐ ఉపేందర్ తెలిపారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం తంగళ్ళపల్లికి చెందిన కొండ జ్యోతిని ఆమె భర్త ఆంజనేయులు ఈనెల 1వ తారీఖున ఆమె నిద్రిస్తున్న సమయంలో కత్తితో అతి కిరాతకంగా కోసి చంపాడని కేసు నమోదు చేసుకొని దర్యాప్తు కొనసాగిస్తున్న క్రమంలో నిందితుడి విచారణలో వెల్లడించినట్లు వారు తెలిపారు. భార్య జ్యోతి గత కొంతకాలంగా తీవ్ర అనారోగ్యంతో బాధపడుతూ ఎన్ని ఆసుపత్రిలు తిరిగిన న్యాయం కాకపోవడంతో ఎలాగైనా భార్యను చంపాలనే ప్లాన్ ప్రకారం కత్తితో గొంతు కోశాడని పోలీసులు వెల్లడించారు. నిన్నిత్రుని అరెస్ట్ చేసి రిమాండ్ కు తరలించినట్లు వారు తెలిపారు.