byసూర్య | Wed, Aug 17, 2022, 12:24 PM
ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా లోని ప్రియదర్శిని జూరాల ప్రాజెక్టు వరద ప్రవాహం కొనసాగుతోంది. 44 గేట్లు ఎత్తి దిగువ భాగానికి నీటిని వదులుతున్నారు. జూరాల ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటిమట్టం: 318. 516 మీటర్లు కాగా ప్రస్తుత నీటిమట్టం: 317. 840 మీటర్ల ఎత్తులో నిలువ ఉంది. పూర్తి నీటి నిల్వ సామర్థ్యం 9. 657 టీఎంసీలు కాగా ప్రస్తుతం 8. 300టీఎంసీల స్థాయిలో నిల్వ చేశారు. ప్రస్తుతం 2, 50, 000 క్యూసెక్కుల వరద ఎగువ భాగం నుండి వస్తుంది. 2, 42, 610 క్యూసెక్కులు నిల్వ చేస్తున్నారు కుడి ఎడమ కాల్వలు, విద్యుత్ ఉత్పత్తి ప్రాజెక్టు సహా దిగువకు 2, 44, 569 కూసెక్కులు విడుదల చేస్తున్నారు.