byసూర్య | Wed, Aug 17, 2022, 12:24 PM
ఎల్బీనగర్ పోలీసు స్టేషన్ పరిదిలోని మన్సురాబాద్ వెల్లే దారిలో అర్థరాత్రి యువకులు గ్యాంగ్ వార్ జరిగింది, నాగోల్ కి చెందిన గ్యాంగ్, బండ్లగుడా కి చెందిన మరో గ్యాంగ్ అర్ధరాత్రి 1గంటల ప్రాంతంలో తిరుమల బార్ సమీపం లో 30 మంది యువకులు ఇద్దరిని దారుణంగా హింసించి పరుగెత్తుకుంటూ కొడుతున్న దృశ్యలు సీసీ కెమెరాల్లో నమొదవడం తో కేస్ నమోదు చేసుకున్న పోలీస్ లు దర్యాప్తు చేస్తున్నారు. దారిలో వెల్లే వారు వీడియో తీస్తుండగా కర్రలతో అతనికి కూడా బెదిరింపులకు పాల్పడిన దృశ్యాలను మనం వీడియోలో చూడవచ్చు. రోడ్ల పై ఇలా గ్యాంగ్ వార్ చేసుకోవడం పట్ల పోలీస్ ల గస్తీ ఎంతమేరకు ఉంది అన్న విషయం పట్ల ప్రజలు విమర్శలు చేస్తున్నారు. ఇలాంటి గొడవల ఘటనలు ఎల్బి నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో గత 6 నెలల్లో ఇప్పటికే నాలుగు జరిగిన కూడా యువకులను అదుపుచేయటం లో పోలీస్ లు విఫలం అయినట్లు విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.