byసూర్య | Wed, Aug 17, 2022, 12:22 PM
జీవితం మీద ఆశలేదు బతకాలనే కోరిక లేదంటూ లేఖ రాసి యువకుడు ఉరే సుకుని బలవన్మరణానికి పాల్పడిన సంఘటన నాగర్ కర్నూల్ జిల్లా బిజినేపల్లి మండలం ఎర్రకుంట తండాలో మంగళవారం చోటు చేసుకుంది. ఎస్సై వెంకటేశ్ కథనం ప్రకారం.. తండాకు చెందిన యువకుడు కిషన్ నాయక్ (19) ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఆటో డ్రైవర్గా పనిచేస్తున్న కిషన్ సోదరుడు పాండు ఇంటికి వచ్చి చూసే సరికి, ఫ్యాన్ కు వేలాడుతూ అప్ప టికే మృతి చెందాడు. సమాచారం అందుకున్న పోలీసులు పరిశీలించి మృతదేహాన్ని నాగర్ కర్నూల్ జనరల్ ఆసుపత్రికి తరలించారు. యువకుడి తండ్రి కొన్నేళ్ల క్రితమే మృతిచెందగా, తల్లి రెండేళ్ల క్రితం అనారోగ్యంతో మృతి చెందింది. తల్లి దూరమైందని నిత్యం ఆందోళనకు గురయ్యేవాడని, ఆమె మరణం తట్టుకోలేకే ఆత్మహత్యకు పాల్పడి ఉంటాడని కుటుంబస భ్యులు పేర్కొన్నారు. సంఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై వెంకటేశ్ తెలిపారు.
లెటర్ లో ఇలా రాసి ఉంది: అందరికి నేను చెప్పేది ఒక్కటే.. ఎందుకో నాకు బ్రతకాలని లేదు. నాకంటు మరొకటి ఆశలేదు. దయచేసి నా చావుతో ఎవరిని అవమానించవద్దు. నా ఇష్టపూర్వకంగా నేను చనిపోతున్నాను. నా చావును ఎవరు కూడా తప్పుగా అనుకోవద్దు. చివరిగా ఎవరు కూడా నా వల్ల అనుమానిస్టులుగా లేకుండా నా బాడీని సమాధి చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటు అందరి నుండి సెలవు తీసుకుంటున్నాను. ఇట్లు కిషన్.