తెలంగాణ విద్యాశాఖ కీలక ఉత్తర్వులు
byసూర్య |
Wed, Aug 17, 2022, 11:56 AM
తెలంగాణలోని మరో 37 కస్తూర్బా గాంధీ బాలికా విద్యాలయాలను ఇంటర్ వరకు అప్గ్రేడ్ చేస్తూ విద్యాశాఖ మంగళవారం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ మేరకు జీవో 82ను విడుదల చేసింది. ఈ విద్యాసంవత్సరం నుంచే వీటిల్లో ఇంటర్ ఫస్టియర్ క్లాసులు ప్రారంభం కానున్నాయి. తెలుగు, ఇంగ్లీష్ మాధ్యమాల్లో ఎంపీసీ, బైపీసీ, సీఈసీ, ఎంపీహెచ్డబ్ల్యూ కోర్సులను నిర్వహించనున్నారు. ఒక్కో కేజీబీవీలో 2 కోర్సులకు మాత్రమే అనుమతి ఇచ్చారు.
Latest News