byసూర్య | Wed, Aug 17, 2022, 11:56 AM
సంగారెడ్డి జిల్లా జిన్నారం మండలం బొల్లారం మున్సిపాలిటీ పరిధిలోని తెలంగాణ ఆదర్శ పాఠశాలలో బుధవారం మధ్యాహ్నం వక్తృత్వ, చిత్రలేఖన పోటీలను నిర్వహిస్తున్నట్లు పాఠశాల వర్గాలు ఒక ప్రకటనలో తెలిపారు. భారత స్వాతంత్ర వజ్రోత్సవాల సందర్భంగా నచ్చిన స్వాతంత్ర సమరయోధుడు అంశంపై వక్తృత్వ పోటీలు, చిత్రలేఖన పోటీలను నిర్వహిస్తున్నట్లు తెలిపారు. పోటీలలో గెలుపొందిన విద్యార్థులకు బహుమతులు ప్రధానం చేయనున్నట్లు తెలిపారు.