కాంగ్రెస్ ను వీడి టిఆర్ఎస్ లో చేరిన వార్డు సభ్యులు

byసూర్య | Wed, Aug 17, 2022, 11:54 AM

సిర్గాపూర్ మండలం పొట్ పల్లి గ్రామానికి చెందిన కాంగ్రెస్ పార్టీ సర్పంచ్ గంగ బాయి తనయుడు వెంకట్ రావుతో పాటు ఆరు మంది వార్డు సభ్యులు మరియు 50 కుటుంబాలు కాంగ్రెస్ ను వీడి మంగళవారం నారాయణఖేడ్ నియోజకవర్గ ఎమ్మెల్యే ఎం. భూపాల్ రెడ్డి సమక్షంలో టిఆర్ఎస్ తీర్థం పుచ్చుకున్నారు. ఈసందర్భంగా ఎమ్మెల్యే వారందరికీ కండూవా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈసందర్భంగా వారు మాట్లాడుతూ. నాయకులు తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన అనేక అభివృద్ధి మరియు సంక్షేమ పథకాలు చూసి ఇతర పార్టీల ప్రజాప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు తెరాసలో చేరుతున్నారు అన్నారు. పార్టీలో చేరిన వారందరికీ సముచితమైన న్యాయం జరుగుతుంది అన్నారు. పార్టీని నమ్ముకున్న ప్రతి కార్యకర్తకు అండగా ఉంటాము అన్నారు. ఈ కార్యక్రమంలో పార్టీ జిల్లా యువ నాయకులు రోషన్ రెడ్డి, జడ్పీటీసీ రాఘవరెడ్డి, ఎంపీపీ మహిపాల్ రెడ్డి, వైస్ ఎంపీపీ మాధవరావు పాటిల్, తెరాస పార్టీ అధ్యక్షులు సంజీవన్ రావ్, పోచపూర్ మాజీ ఎంపీటీసీ కృష్ణ గౌడ్, యాదవరావ్, తదితరులు ఉన్నారు.


Latest News
 

కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థుల తుది జాబితా.. ఖమ్మం నుంచి పొంగులేటి బంధువుకు ఛాన్స్ Wed, Apr 24, 2024, 10:04 PM
హైదరాబాద్ మెట్రో ప్రయాణికులకు తీపి కబురు Wed, Apr 24, 2024, 09:59 PM
ఆమె మాటలు నమ్మి నట్టేట మునిగిన రిటైర్డ్ IAS.. రూ.1.89 కోట్లు హాంఫట్ Wed, Apr 24, 2024, 09:00 PM
మంచినీళ్లలా బీర్లు తాగేశారు.. ఆల్ టైం రికార్డ్, అమ్మో అన్ని కోట్ల బీర్లా Wed, Apr 24, 2024, 08:56 PM
చెప్పులతో పొట్టు పొట్టు కొట్టుకున్నరు..బస్సులో భార్యల సీట్ల కోసం భర్తల ఫైట్ Wed, Apr 24, 2024, 08:49 PM