byసూర్య | Tue, Aug 16, 2022, 01:30 PM
ఖమ్మం రూరల్ మండలం దానవాయిగూడెం సబ్ జైలు సమీపంలో మంగళవారం రోడ్డు ప్రమాదం జరిగింది. రామన్నపేట నుంచి ఖమ్మంకు బైక్ పై వెళ్తున్న ఓ వ్యక్తి సబ్ జైలు సమీపంలో ఖమ్మం నుంచి రామన్నపేట వెళ్తున్న డీసీఎం వ్యాను అదుపుతప్పి ఢీకొంది. దీంతో ఆ వ్యక్తి డీసీఎం కింద అదుపుతప్పి పడిపోయాడు. ఈ ప్రమాదంలో డీసీఎం వ్యాను బైక్ పై వెళ్తున్న వ్యక్తి తలపై నుంచి వెళ్లడంతో తీవ్రగాయాలతో వ్యక్తి అక్కడిక్కడే మృతిచెందాడు. స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. ఘటన స్థలాన్ని చేరుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. మృతుడి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.