మదినిండా దేశభక్తి

byసూర్య | Tue, Aug 16, 2022, 01:24 PM

జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో 75 ఏళ్ల స్వతంత్ర భారత వజ్రోత్సవ వేడుకల్లో భాగంగా మదినిండా దేశభక్తితో ఉదయం 11. 30 గంటలకు జిల్లా ప్రజలు, ప్రజాప్రతినిధులు, అధికారులు, సిబ్బంది, కార్మికులు సామూహిక గీతాలాపన కార్యక్రమంలో పాల్గొన్నారు. జయశంకర్ భూపాలపల్లి జిల్లా కేంద్రంలో ని అంబెడ్కర్ కూడలిలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో భూపాలపల్లి శాసనసభ్యుడు గండ్ర వెంకటరమణ రెడ్డి , జిల్లా కలెక్టర్ భావేశ్ మిశ్రా , జిల్లా ఎస్పీ సురేందర్ రెడ్డి, పాఠశాల, కళాశాల విద్యార్థులు, కార్మిక, ప్రజా , వివిధ సంఘాలు, ప్రజలు , ప్రభుత్వ ప్రైవేటు ఆఫీసుల్లో ఎక్కడివారు అక్కడే నిలబడి జాతీయ గీతం జనగణమన గీతపాలన చేశారు. అదేవిధంగా జయశంకర్ జిల్లా లోని 11 మండలాల్లోని అధికారులు, ప్రజా ప్రతినిధులు, విద్యార్థులు ప్రధాన రహదారులపై ర్యాలీగా వచ్చి జాతీయ గీతాలాపన లో పాల్గొన్నారు.


Latest News
 

కాంగ్రెస్‌ ప్రభుత్వ అసమర్థత వల్ల గురుకుల విద్యార్థి మృతి : మాజీ మంత్రి హ‌రీశ్‌రావు Wed, Apr 17, 2024, 11:39 PM
సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ బీభత్సం,,,6 నిమిషాల్లో 6 యాక్సిడెంట్లు Wed, Apr 17, 2024, 09:19 PM
నిప్పుల గుండంలా తెలంగాణ.. వడదెబ్బతో ఇద్దరు మృతి, నేడు మరింత ఎండలు Wed, Apr 17, 2024, 09:14 PM
తెలంగాణ వైపు 70 ఏనుగుల గుంపు.. ఆ ప్రాంతవాసుల్లో టెన్షన్ టెన్షన్..! Wed, Apr 17, 2024, 09:07 PM
అమ్మబాబోయ్.. ఈ మిల్క్ షేక్ తాగితే 7 గంటలు మత్తులోనే Wed, Apr 17, 2024, 09:03 PM