నేను ఎవరిని తప్పుపట్టేలా మాట్లాడలేదు: పాల్వాయి స్రవంతి రెడ్డి

byసూర్య | Wed, Aug 10, 2022, 09:30 PM

సోషల్ మీడియాలో మునుగోడు ఎన్నికలకు సంబంధించి కాంగ్రెస్ పార్టీ తరఫు ఓ ఆడియో చక్కర్లు కోడుతోంది. తనకు సంబంధించిన ఆ అడియో పై కాంగ్రెస్ నాయకురాలు పాల్వాయి స్రవంతి రెడ్డి స్పందించారు. మునుగోడు ఉప ఎన్నికల్లో కాంగ్రెస్‌ టిక్కెట్‌ ఆశిస్తున్న పాల్వాయి స్రవంతి రెడ్డి, ఓ కార్యకర్త మధ్య సెల్‌ఫోన్ సంభాషణ సోషల్‌మీడియాలో వైరల్‌గా మారింది. మునుగోడు నుంచి టిక్కెట్ ఆశిస్తున్న మరో అభ్యర్థి చల్లమల్ల కృష్ణారెడ్డికి పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డితో లోపాయికారి ఒప్పందం కుదిరినట్లు ఓ కార్యకర్త స్రవంతికి చెబుతున్నట్లు ఆ ఆడియోలో ఉంది. అయితే కృష్ణారెడ్డికి టిక్కెట్‌ ఇస్తే కాంగ్రెస్ పార్టీకి హుజూరాబాద్‌లో వచ్చిన ఫలితాలే ఇక్కడా వస్తాయని స్రవంతి అన్నట్లుగా సంభాషణ సాగింది.


ఈ ఆడియో సోషల్‌మీడియాలో వైరల్‌గా మారడంతో పాల్వాయి స్రవంతి స్పందించారు. ఆ ఆడియోలో తాను ఎవరి గురించి తప్పుగా మాట్లాడలేదని వివరణ ఇచ్చారు. తనపై కక్షతో కొందరు కావాలనే ఆ ఆడియో క్లిప్‌ను సోషల్‌మీడియాలో వైరల్‌ చేస్తున్నారని మండిపడ్డారు. చల్లమల్ల కృష్ణా రెడ్డి నియోజకవర్గానికి కొత్త వ్యక్తి అని.. అతనికి టికెట్‌ ఇస్తే ఓట్లు పడవని మాత్రమే చెప్పినట్లు స్పష్టం చేశారు.


Latest News
 

గోశాలలోని గోవులకు గో సేవ Thu, May 16, 2024, 10:46 AM
రాజీవ్ రహదారి పై రోడ్డు ప్రమాదం Thu, May 16, 2024, 10:40 AM
ఏపీలో గెలుపు జగన్‌దే.. తెలంగాణలో కాంగ్రెస్‌కు ఒక్కటే ఎంపీ సీటు: కేటీఆర్ Wed, May 15, 2024, 11:23 PM
రిగ్గింగ్ జరిగింది.. రీపోలింగ్‌కు ఎంత దూరమైనా వెళ్తా: మాధవీలత Wed, May 15, 2024, 11:18 PM
ఇదేం దరిద్రపు అలవాటు తల్లి.. అర్థరాత్రి శబ్దాలు, ఏంటా అని లేచి చూస్తే షాకింగ్ విషయం వెలుగులోకి Wed, May 15, 2024, 08:37 PM