byసూర్య | Wed, Aug 10, 2022, 09:30 PM
సోషల్ మీడియాలో మునుగోడు ఎన్నికలకు సంబంధించి కాంగ్రెస్ పార్టీ తరఫు ఓ ఆడియో చక్కర్లు కోడుతోంది. తనకు సంబంధించిన ఆ అడియో పై కాంగ్రెస్ నాయకురాలు పాల్వాయి స్రవంతి రెడ్డి స్పందించారు. మునుగోడు ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ టిక్కెట్ ఆశిస్తున్న పాల్వాయి స్రవంతి రెడ్డి, ఓ కార్యకర్త మధ్య సెల్ఫోన్ సంభాషణ సోషల్మీడియాలో వైరల్గా మారింది. మునుగోడు నుంచి టిక్కెట్ ఆశిస్తున్న మరో అభ్యర్థి చల్లమల్ల కృష్ణారెడ్డికి పీసీసీ అధ్యక్షుడు రేవంత్రెడ్డితో లోపాయికారి ఒప్పందం కుదిరినట్లు ఓ కార్యకర్త స్రవంతికి చెబుతున్నట్లు ఆ ఆడియోలో ఉంది. అయితే కృష్ణారెడ్డికి టిక్కెట్ ఇస్తే కాంగ్రెస్ పార్టీకి హుజూరాబాద్లో వచ్చిన ఫలితాలే ఇక్కడా వస్తాయని స్రవంతి అన్నట్లుగా సంభాషణ సాగింది.
ఈ ఆడియో సోషల్మీడియాలో వైరల్గా మారడంతో పాల్వాయి స్రవంతి స్పందించారు. ఆ ఆడియోలో తాను ఎవరి గురించి తప్పుగా మాట్లాడలేదని వివరణ ఇచ్చారు. తనపై కక్షతో కొందరు కావాలనే ఆ ఆడియో క్లిప్ను సోషల్మీడియాలో వైరల్ చేస్తున్నారని మండిపడ్డారు. చల్లమల్ల కృష్ణా రెడ్డి నియోజకవర్గానికి కొత్త వ్యక్తి అని.. అతనికి టికెట్ ఇస్తే ఓట్లు పడవని మాత్రమే చెప్పినట్లు స్పష్టం చేశారు.