ప్రేమికులుగా ముద్రవేశారని...మన స్థాపంతో యువతి, యువకుడి ఆత్మహత్య

byసూర్య | Wed, Aug 10, 2022, 09:31 PM

యువతి, యువకుడు కలిస్తే చాలు ఎవరైనా వారు ప్రేమికులేనని ముద్రవేస్తుంటారు. కానీ ఆ ముద్ర కొందరి జీవితాల్లో విషాదం కూడా నింపుతుందన్నది మనం గ్రహించాలి. వాస్తవాలు గ్రహించకుండా నిందలు మోపరాదు. నిజామాబాద్ జిల్లాలో ఓ యువ జంట గడ్డి మందు సేవించి ఆత్మహత్యకు యత్నించింది. నిజామాబాద్ నగరంలోని గిరిరాజ్ కాలేజీ సమీపంలో నందిపేటకు చెందిన వినయ్ కుమార్ అనే యువకుడు, మరో యువతి కలిసి ఆత్మహత్యాయత్నం చేశారు. హాస్పిటల్‌లో చికిత్స పొందుతూ యువకుడు వినయ్ మృతి చెందగా.. యువతి పరిస్థితి విషమంగా ఉంది. ప్రస్తుతం ఆమె నిజామాబాద్‌లోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతోంది.


వీరిద్దరూ ఆత్మహత్యకు యత్నించే ముందు సూసైడ్ నోట్ రాశారు. తాము అన్నాచెల్లెళ్లలా మెలిగితే.. ప్రేమికులంటూ తప్పుడు ప్రచారం చేశారని లేఖలో పేర్కొన్నారు. ఈ విషయాన్ని ఎన్నిసార్లు చెప్పినా అర్థం చేసుకోవడం లేదని వాపోయారు. మనస్ఫూర్తిగా చెబుతున్నాం.. మేం అన్నా చెల్లెళ్లమే. మేం ఎవరినైనా నొప్పిస్తే.. క్షమించండి. చేయని తప్పును ఒప్పుకోలేక మేం చనిపోవాలని నిర్ణయించుకున్నాం. అందుకే మనస్థాపంతో బలవన్మరణానికి పాల్పడుతున్నట్టు ఆ లేఖలో పేర్కొన్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.


Latest News
 

అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసిన ఎమ్మెల్యే గోపాల్ Sun, Sep 24, 2023, 03:01 PM
గ్రామా పంచాయతీ భవన నిర్మాణ పనులకు శంకుస్థాపన Sun, Sep 24, 2023, 02:44 PM
జమ్మికుంట బస్టాండ్ లో స్వచ్ఛత హీ సేవ కార్యక్రమం Sun, Sep 24, 2023, 01:49 PM
చిన్నాయ్యపల్లిలో గర్భిణీ స్త్రీలకు సీమంతం Sun, Sep 24, 2023, 12:49 PM
వివిధ పార్టీల నుండి బీఆర్ఎస్ లో చేరికలు Sun, Sep 24, 2023, 12:37 PM