ప్రేమికులుగా ముద్రవేశారని...మన స్థాపంతో యువతి, యువకుడి ఆత్మహత్య

byసూర్య | Wed, Aug 10, 2022, 09:31 PM

యువతి, యువకుడు కలిస్తే చాలు ఎవరైనా వారు ప్రేమికులేనని ముద్రవేస్తుంటారు. కానీ ఆ ముద్ర కొందరి జీవితాల్లో విషాదం కూడా నింపుతుందన్నది మనం గ్రహించాలి. వాస్తవాలు గ్రహించకుండా నిందలు మోపరాదు. నిజామాబాద్ జిల్లాలో ఓ యువ జంట గడ్డి మందు సేవించి ఆత్మహత్యకు యత్నించింది. నిజామాబాద్ నగరంలోని గిరిరాజ్ కాలేజీ సమీపంలో నందిపేటకు చెందిన వినయ్ కుమార్ అనే యువకుడు, మరో యువతి కలిసి ఆత్మహత్యాయత్నం చేశారు. హాస్పిటల్‌లో చికిత్స పొందుతూ యువకుడు వినయ్ మృతి చెందగా.. యువతి పరిస్థితి విషమంగా ఉంది. ప్రస్తుతం ఆమె నిజామాబాద్‌లోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతోంది.


వీరిద్దరూ ఆత్మహత్యకు యత్నించే ముందు సూసైడ్ నోట్ రాశారు. తాము అన్నాచెల్లెళ్లలా మెలిగితే.. ప్రేమికులంటూ తప్పుడు ప్రచారం చేశారని లేఖలో పేర్కొన్నారు. ఈ విషయాన్ని ఎన్నిసార్లు చెప్పినా అర్థం చేసుకోవడం లేదని వాపోయారు. మనస్ఫూర్తిగా చెబుతున్నాం.. మేం అన్నా చెల్లెళ్లమే. మేం ఎవరినైనా నొప్పిస్తే.. క్షమించండి. చేయని తప్పును ఒప్పుకోలేక మేం చనిపోవాలని నిర్ణయించుకున్నాం. అందుకే మనస్థాపంతో బలవన్మరణానికి పాల్పడుతున్నట్టు ఆ లేఖలో పేర్కొన్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.


Latest News
 

చలి వేంద్రాన్ని ప్రారంభించిన బీఆర్ఎస్ నాయకులు ఐలాపూర్ మాణిక్ యాదవ్ Mon, Mar 16, 2026, 04:07 PM
ఉపాధి హామీ చట్టం కొనసాగించాలని దళిత బహుజన ఫ్రంట్ పిలుపు Mon, Mar 16, 2026, 04:03 PM
ప్రజావాణికి జిల్లా అధికారులే హాజరు కావాలి: అదనపు కలెక్టర్ పాండు Mon, Mar 16, 2026, 03:53 PM
బీఆర్ఎస్ నాయకులు మాద్రి పృథ్వీరాజ్ గారి ఆధ్వర్యంలో ఇఫ్తార్ విందు Mon, Mar 16, 2026, 03:49 PM
ప్రత్యేక బస్సుల్లో పెరిగిన ఛార్జీలు: టీజీఎస్ఆర్టీసీ Mon, Mar 16, 2026, 03:47 PM