byసూర్య | Tue, Aug 09, 2022, 04:03 PM
భద్రాచలం వద్ద గోదావరి నీటిమట్టం మరోసారి పెరుగుతుంది. గంటగంటకు ప్రవాహం ఎక్కువవుతున్నది. మంగళవారం మ. ఒంటిగంటకు గోదావరి నీటిమట్టం 41.2 అడుగులుగా ఉన్నది. ప్రస్తుతం నదిలో 8,56,949 క్యూసెక్కుల వరద ప్రవాహం కొనసాగుతున్నది. ఎగువతో పాటు పరీవాహక ప్రాంతాల్లో కురుస్తున్న వర్షాలకు నదిలోకి ప్రవాహం పెరుగుతున్నది. నేడు 41.2 అడుగుల వద్ద ప్రవాహం కొనసాగుతుండగా 43 అడుగులకు చేరితే మొదటి ప్రమాద హెచ్చరిక జారీ చేస్తారు.