byసూర్య | Tue, Aug 09, 2022, 03:46 PM
కరీంనగర్ జిల్లా మానకొండూరు ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ పై కేసు నమోదైంది. సిద్దిపేట జిల్లాకు చెందిన వ్యక్తి 2020లో రసమయి బాలకిషన్ నుంచి ప్రాణహాని ఉందని ఫిర్యాదు చేశాడు. దీంతో రెండేళ్లకు పోలీసులు స్పందించి కేసు నమోదు చేశారు. రసమయి బాలకిషన్ పై 290, 506 సెక్షన్ల కింద పోలీసులు కేసు నమోదు చేశారు. రసమయి బాలకిషన్ టీఆర్ఎస్ నుంచి ఎమ్మెల్యేగా ఉన్నారు.