byసూర్య | Sat, Aug 06, 2022, 12:44 PM
రాజన్న సిరిసిల్ల పట్టణానికి చెందిన ఓ న్యాయవాదిపై మున్సిపల్ కమిషనర్ తో పాటు సిబ్బంది దాడి చేశారని ఆ న్యాయవాది ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. పట్టణానికి చెందిన న్యాయవాది భాజపా ఎస్టీ మోర్చా నాయకుడు మొగిలి రాజు పై బుధవారం రాత్రి మున్సిపల్ కమిషనర్ తో పాటు సిబ్బంది అతనిపై దాడి చేశారని పోలీసులకు ఫిర్యాదు చేయగా మున్సిపల్ కమిషనర్ తో పాటు స్థానిక 11 మంది కౌన్సిలర్ మరో 9 మంది పై ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు.