byసూర్య | Sat, Aug 06, 2022, 12:46 PM
శ్రీ పాద ఎల్లంపల్లి ప్రాజెక్టులోకి మళ్ళీ వరద ప్రవాహం తగ్గింది. ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటి మట్టం 148 మీటర్లకు గాను శనివారం ఉదయం వరకు 146. 73 మీటర్లకు చేరింది. నీటి నిల్వ సామర్ధ్యం 20. 175 టీఎంసీలకు గాను 16. 7155 టీఎంసీలుగా నమోదైంది. ప్రాజెక్టులోకి 112423 క్యూసెక్కుల నీరు వచ్చి చేరగా, 15 గేట్లు ఎత్తి 91396 క్యూసెక్కుల నీరు దిగువకు వదిలారు. ఇందులో హైదరాబాద్ మెట్రో వాటర్ స్కీంకు 322 క్యూసెక్కుల నీరు సరఫరా చేశారు.