byసూర్య | Sat, Aug 06, 2022, 12:44 PM
స్వరాష్ట్ర సాధన కోసం తన జీవితాన్నే అంకితం చేసిన మహనీయులు, తెలంగాణ స్పూర్తి ప్రదాత ఆచార్య కొత్తపల్లి జయశంకర్ సార్ అని రాష్ట్ర సంక్షేమ శాఖ మంత్రి, ధర్మపురి శాసనసభ్యులు కొప్పుల ఈశ్వర్ అన్నారు. శనివారం జయశంకర్ జయంతి సందర్భంగా వారికి ఘన నివాళులు అర్పిస్తున్నట్లు మంత్రి ఈశ్వర్ ప్రకటనలో పేర్కొన్నారు. తెలంగాణ స్వరాష్ట్రంగా ఎందుకు ఏర్పడాలో పల్లె పల్లెనా చైతన్యం రగిలించిన గొప్ప వ్యక్తి జయశంకర్ సార్ అని మంత్రి తెలిపారు.