byసూర్య | Sat, Aug 06, 2022, 12:39 PM
కామారెడ్డి జిల్లా బిచ్కుంద మండలం లోని పుల్కల్ మంజీరా నది నుండి అక్రమంగా ఇసుక రవాణా యధేచ్చగా కొనసాగుతున్నది. రాత్రి అయ్యిందంటే చాలు ట్రాక్టర్లతో బిచ్కుంద తదితర ప్రాంతాలకు అక్రమ ఇసుక రవాణా ప్రారంభమవుతుంది. అర్ధరాత్రి నుండి తెల్లవారి జాము వరకు ఈ రవాణా కొనసాగుతున్నది. దీనిపై సంబంధిత అధికారులు కఠిన చర్యలు తీసుకోవాలని పలువురు కోరుతున్నారు.