byసూర్య | Sat, Aug 06, 2022, 12:40 PM
కామారెడ్డి జిల్లా ఎల్లారెడ్డి మండలంలోని కడుపు నొప్పి భరించలేక మహిళ ఆత్మహత్య చేసుకున్న సంఘటన ఎల్లారెడ్డి మండల పరిధిలోని మచాపూర్ గ్రామంలో చోటు చేసుకుంది స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం... మాచపూర్ గ్రామానికి చెందిన ఎం. స్వరూప(36) కు గత కొంత కాలంగా మతిస్థిమితం లేకపోవడంతో మరియు కడుపు నొప్పితో బాధ పడుతూ ఉండేదని అన్నారు. శుక్రవారం ఉదయం గ్రామ శివారు ప్రాంతంలో ఉన్న పాత బావిలో దూకింది. ఆమె దూకడాన్ని గమనించిన స్థానికులు భర్తకు సమాచారం ఇవ్వడం తో ఆమెను బయటకు తీసి చూడగా అప్పటికే మృతి చెందినట్లు వారు తెలిపారు. ఆమెకు ఒక కుమారుడు ఉన్నాడని స్థానికులు తెలిపారు.