byసూర్య | Sat, Aug 06, 2022, 12:36 PM
హన్వాడ మండలం లో ఇద్దరు ప్రధానోపాధ్యాయులు సస్పెండ్ చేస్తూ జిల్లా కలెక్టర్ ఉత్తర్వులు జారీ చేశారు. మహబూబ్ నగర్ జిల్లా హన్వాడ మండలం టంకర ప్రాథమిక, ఉన్నత పాఠశాలలో విద్యార్థులకు మూడు రోజులు మధ్యాహ్నం భోజనం పెట్టనందుకు ప్రాథమిక పాఠశాల హెచ్ఎం నర్సింగమ్మ, ఉన్నత పాఠశాల హెచ్ఎం రాజశేఖర్ రావు లను జిల్లా కలెక్టర్ వెంకట్రావు సస్పెండ్ చేస్తూ ఆదేశాలు జారీ చేశారు. మూడు రోజుల పాటు పాఠశాలలో విద్యార్థులకు మధ్యాహ్న భోజనం అందించలేదు.