దాసోజు శ్రవణ్ సొంత గూటికి రావాలి: బండి సంజయ్

byసూర్య | Sat, Aug 06, 2022, 04:14 AM

దాసోజు శ్రవణ్ సొంత గూటికి రావాలని కోరుకొంటున్నానని తెలంగాణ రాష్ట్ర బీజేపీ చీఫ్ బండి సంజయ్ సూచించారు. తెలంగాణలో ఆసక్తికర రాజకీయ పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. ఒక్కరోజు వ్యవధిలో కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, దాసోజు శ్రవణ్ కాంగ్రెస్ పార్టీకి గుడ్ బై చెప్పారు. కోమటిరెడ్డి ఈ నెల 21న బీజేపీలో చేరనుండగా, దాసోజు శ్రవణ్ కూడా బీజేపీలోకి రావాలంటూ బండి సంజయ్ ఆహ్వానం పలికారు. దాసోజు శ్రవణ్ జాతీయ భావాలున్న వ్యక్తి అని తెలిపారు. తెలంగాణ ఉద్యమంలోనూ చురుగ్గా వ్యవహరించారని వెల్లడించారు. దురదృష్టం ఏమిటంటే, ఆనాడు కేసీఆర్ కు శ్రవణ్ చాలా మంచివాడిలా కనిపించారని, కానీ ప్రజల్లో శ్రవణ్ కు ఆదరణ లభిస్తుంటే భరించలేక ఆయనను అణగదొక్కారని బండి సంజయ్ విమర్శించారు. దాసోజు శ్రవణ్ గతంలో ఏబీవీపీ తరఫున పలు ఉద్యమాల్లో పాల్గొన్నారని, ఆయన తన సొంత గూటికి రావాలని కోరుకుంటున్నామని తెలిపారు.


Latest News
 

గులాబీ పార్టీ చరిత్రలో ఇదే తొలిసారి.. కేసీఆర్ ఫ్యామిలీ నుంచి ఒక్కరు కూడా లేరు Fri, Apr 26, 2024, 08:37 PM
కేఏ పాల్ కాఫీకి రమ్మంటే వెళ్లా,,కండువా కప్పి పార్టీ అధ్యక్షుడి పదవి ఇచ్చారు Fri, Apr 26, 2024, 08:33 PM
రైతులకు రుణమాఫీ చేయలేకపోతే మాకు అధికారమెందుకు,,,హరీశ్ రాజీనామా లేఖ సిద్ధంగా పెట్టుకో Fri, Apr 26, 2024, 08:27 PM
హైదరాబాద్ బీజేపీ ఎంపీ అభ్యర్థి మాధవీలతపై రేణు దేశాయ్ ఇంట్రెస్టింగ్ పోస్ట్ Fri, Apr 26, 2024, 08:23 PM
వికారాబాద్‌ యువకుడికి సివిల్స్‌ ర్యాంక్.. ఘనంగా సన్మానాలు, చివరికి షాకింగ్ ట్విస్ట్ Fri, Apr 26, 2024, 08:19 PM