byసూర్య | Sat, Aug 06, 2022, 03:59 AM
టీఆర్ఎస్ ఎమ్మెల్యే జీవన్ రెడ్డిని ఆ పార్టీ ఎమ్మెల్సీ కవితా పరామర్శించారు. సాంత పార్టీ నేత నుంచి ఎదురైన హత్యాయత్నం నుంచి టీఆర్ఎస్ కీలక నేత, ఆర్మూర్ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి త్రుటిలో తప్పించుకున్న సంగతి తెలిసిందే. ఈ ఘటనపై సమాచారం అందుకున్న టీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత శుక్రవారం జీవన్ రెడ్డిని పరామర్శించారు. హైదరాబాద్ బంజారాహిల్స్లోని జీవన్ రెడ్డి ఇంటికి వెళ్లిన కవిత... హత్యాయత్నం, దాని నుంచి బయట పడిన తీరును జీవన్ రెడ్డిని అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా కవితను చూసినంతనే జీవన్ రెడ్డి భార్య భావోద్వేగానికి గురయ్యారు. దుఃఖం ఆపుకోలేక కవిత ముందే కన్నీరు పెట్టుకున్నారు. దీంతో ఆమెను ఓదార్చిన కవిత... తాము అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. భయపడాల్సిన అవసరం లేదని, నేతలకు పార్టీ వెన్నుదన్నుగా నిలుస్తుందని కూడా ఆమె జీవన్ రెడ్డి కుటుంబ సభ్యులకు తెలిపారు.