byసూర్య | Fri, Aug 05, 2022, 04:31 PM
తెలంగాణలోని భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఓ వ్యక్తికి మంకీ పాక్స్ లక్షణాలు కనిపించడం కలకలం రేపింది. మణుగూరు మండలం విజయనగరం గ్రామానికి చెందిన ఓ విద్యార్థికి మంకీ పాక్స్ లక్షణాలు కనిపించాయి. మధ్యప్రదేశ్ లో చదువుకుంటున్న అతను 2 రోజుల క్రితం స్వగ్రామానికి వచ్చాడు. వ్యాధి లక్షణాలు ఉండటంతో ప్రస్తుతం కొత్తగూడెం ప్రభుత్వాసుపత్రిలో చికిత్స అందిస్తున్నారు. రక్త నమూనాలు సేకరించి హైదరాబాద్ కు పంపారు.