byసూర్య | Fri, Aug 05, 2022, 04:54 PM
మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి శుక్రవారం కేంద్ర హోంమంత్రి అమిత్ షాను కలిశారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. తాను ఈ నెల 21న అమిత్ షా సమక్షంలో బీజేపీలో చేరుతున్నట్లు ప్రకటించారు. అమిత్ షా తనను పార్టీలోకి ఆహ్వానించారని తెలిపారు. బహిరంగ సభ పెట్టి బీజేపీలో చేరనున్నట్లు రాజగోపాల్ రెడ్డి తెలిపారు. రాజీనామా లేఖ ఇవ్వడానికి స్పీకర్ అపాయింట్ మెంట్ కోసం ఎదురుచూస్తున్నానని చెప్పారు.