byసూర్య | Fri, Aug 05, 2022, 02:10 PM
హుజురాబాద్ టిఆర్ఎస్ నేతలకు ఇంకా బుద్ధి రావడం లేదని వరంగల్ జిల్లా బీజేపీ ఉపాధ్యక్షుడు కనుకుంట్ల రంజిత్ కుమార్ శుక్రవారం ఆరోపించారు. ఒకవైపు చర్చలకు రండి అని పిలుపునిచ్చి, మరోవైపు పోలీసులను అడ్డుపెట్టుకొని అక్రమ అరెస్టులు చేయించడంతో తెలిసిపోతుంది. మీ కుటిల రాజకీయం, ప్రజలు తప్పకుండా రానున్న ఎన్నికల్లో రాష్ట్రంలో టిఆర్ఎస్ పార్టీకి తగిన గుణపాఠం చెప్పడానికి సిద్ధంగా ఉన్నారు. అక్రమ అరెస్టులతో బీజేపీ నాయకులను కార్యకర్తలను అడ్డుకోలేరని ఎన్ని అక్రమ అరెస్టులు చేసిన రెట్టింపు ఉత్సాహంతో ముందుకెళ్తాం. ఈ టీఆర్ఎస్ ప్రభుత్వాన్ని ప్రజల మధ్యలో దోషిగా నిలబెడతామన్నారు.