byసూర్య | Fri, Aug 05, 2022, 02:14 PM
నేడు వరలక్ష్మి వ్రతం సందర్భంగా పూజ సామాగ్రి, పండ్లు, కొనుగోలు దారులతో మార్కెట్లు కిటకిటలాడుతూన్నాయి. ఉప్పల్, బోడుప్పల్, రామంతాపూర్, హబ్సిగూడ, మొదలగు పండ్లు, పూల మార్కెట్లలో ధరల ను రెండింతలు పెంచేశారు. వ్యాపారులు మేలిరకం కుంకుమ కిలోరూ. 180 , పసుపు రూ 200 ఒక్కో కొబ్బరి కాయ రూ 25 నుంచి 30 వరకూ విక్రయిస్తున్నారు. లీటర్ రూ 90 ఉన్న పూజ నూనే నేడు రూ150 విక్రయిస్తున్నారు, తమలపాకులు , వక్కలు, ఖర్జ్ రా, ఆవు పాలు, తేనే, పెరుగు పూజ కు కావలిసిన మొత్తం సమాగ్రీ రెండింతల ధర కు విక్రయిస్తున్నారు వ్యాపారులు. ప్రజలు అసంతృప్తి ప్రకటిస్తూ చేసేది లేక కొంటున్నారు.