byసూర్య | Fri, Aug 05, 2022, 02:01 PM
ఆదిలాబాద్ పట్టణంలోని రైల్వే స్టేషన్ ఆవరణలో ద్విచక్ర వాహనాన్ని ఓ గుర్తు తెలియని వ్యక్తి దగ్ధం చేశాడు. జిల్లా కేంద్రంలోని దుర్గా నగర్ కాలనీకి చెందిన ప్రభుత్వ ఉపాద్యాయుడు రాథోడ్ కిషన్ రైల్వే టికెట్ బుకింగ్ నిమిత్తమై రైల్వే స్టేషన్ వచ్చిన ఆయన తన వాహనాన్ని స్టేషన్ ఆవరణలో పార్కింగ్ చేసాడు. సదరు ఉపాద్యాయుడు టికెట్ బుకింగ్ చేసుకుని బయటకు వచ్చేసరికి తన వాహనం మంటల్లో దగ్ధమైంది. కాగా గురువారం ఉదయం రైల్వే స్టేషన్ లో తన వాహనం పార్కింగ్ విషయమై ఓ వ్యక్తి తో గొడవ పడ్డాడు. ఆ వ్యక్తే తన వాహనానికి నిప్పు పెట్టాడని, ఈ మేరకు బాధితులు కిషన్ టూ టౌన్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశాడు.