![]() |
![]() |
byసూర్య | Fri, Aug 05, 2022, 02:03 PM
సింగరేణి ఉద్యోగులు రక్షణ సూత్రాలపై అవగాహన కలిగి ఉండాలని బెల్లంపల్లి ఏరియా ఎస్ వోటూజీఎం, సేఫ్టీ అధికారి గుప్తా అన్నారు. బెల్లంపల్లి ఏరియాలోని కైరిగూడ ఓసీపీలో గురువారం సేఫ్టీ స్పెషల్ డ్రైవ్ పక్షోత్సవాలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు.
పని చేసే సమయంలో ఎవరైనా ప్రమాదాలకు గురైనప్పుడు అవలంబించాల్సిన సురక్షిత పద్ధతులపై ప్రతి ఒక్కరూ అవగాహన కలిగి ఉండాలన్నారు. గని మేనేజర్ ప్రవీణ్ ఫాటింగ్, డిప్యూటీ మేనేజర్, సునీల్, బెల్లంపల్లి ఏరియా జిఎం కార్యాలయ అధికారులు, సింగరేణి అధికారులు, ఉద్యోగులు పాల్గొన్నారు.