byసూర్య | Fri, Aug 05, 2022, 01:25 PM
నాగర్ కర్నూల్ జిల్లా వెల్దండ మండల కేంద్రంలోని గుండాల గ్రామంలో శ్రీ అంబారం లింగేశ్వర స్వామి గుడిలో గుర్తుతెలియని దుండగులు గురువారం అర్ధరాత్రి గుడికి చెందిన మూడు హుండీలు దొంగలించారు. దొంగలించిన హుండీలను సమీపంలోని కేఎల్ఐ కాలువ వద్ద పగలగొట్టి డబ్బులను దొంగలించడం జరిగింది. ఈ ఘటనపై గ్రామస్తుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాఫు చేస్తున్నారు.