byసూర్య | Thu, Jul 07, 2022, 06:11 PM
మెదక్ జిల్లా శివంపేట మండల స్మశానవాటిక శివారులో ఓ మహిళ అనుమానాస్పద స్థితిలో బుధవారం మృతి చెందింది. స్థానికుల ద్వారా ఈ విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని విచారణ చేపట్టారు.
మృతురాలు తాళ్లపల్లి గడ్డతండాకు చెందిన బులి (50 ) అని గుర్తించారు. ఎవరో గుర్తు తెలియని వ్యక్తులు కావాలనే హత్య చేసి ఉంటారని తండావాసులు ఆరోపిస్తున్నారు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.