byసూర్య | Thu, Jul 07, 2022, 06:13 PM
మెదక్ జిల్లా రామాయంపేట కస్తూర్బా విద్యాలయంలో అరకొర వసతులతో విద్యార్థుల పరిస్థితి ఆగమ్య గోచరంగా మారింది. నాలుగు రోజులుగా నీటి సౌకర్యం లేకపోవడంతో స్నానాలు కూడా చేయలేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని విద్యార్థులు వాపోతున్నారు.
పురుగులు పట్టిన అన్నం పెడుతున్నారని, తాగునీటి సదుపాయం లేక వర్షం నీళ్లు పరిస్థితి దాపురించిందని పదవ తరగతి విద్యార్థిని ఆవేదన వ్యక్తం చేసింది. ప్రభుత్వం స్పందించి తమ ఇబ్బందులు తీర్చాలని విద్యార్థులు వేడుకుంటున్నారు.