ఘనంగా సీతారాముల నిత్యకళ్యాణం

byసూర్య | Tue, Jul 05, 2022, 01:18 PM

భద్రాచలం శ్రీసీతారామచంద్ర స్వామి వారి దేవస్థానంలో మంగళవారం భద్రాద్రి రామయ్య నిత్యకళ్యాణం ఘనంగా నిర్వహించారు. పవిత్ర గోదావరి నది నుండి జలాలను మేలతాళాలు, మంగళ వాయిద్యాలు, వేదమంత్రాల నడుమ ప్రధాన ఆలయానికి తీసుకొచ్చి స్వామి వారి మూలవరులకు అభిషేకం చేశారు. ప్రత్యేక పూజలు అనంతరం స్వామి వారి కళ్యాణమూర్తులను బేడా మండపానికి భక్తుల జయజయ ధ్వానాల నడుమ తీసుకొచ్చారు.
ముందుగా భద్రాద్రి దివ్యక్షేత్ర మహత్యాన్ని భక్తులకు అర్చక స్వాములు తెలిపిన అనంతరం కళ్యాణతంతు ప్రారంభించారు. ఈ సందర్భంగా తొలుత విశ్వక్సేన, ఆరాధన, పుణ్యాహవాచన జరిపి కళ్యాణతంతును కన్నులపండువగా నిర్వహించారు. అనేక మంది దంపతులు ఈ కళ్యాణంలో పాల్గొని తరించారు. కళ్యాణం అనంతరం భక్తులకు స్వామి వారి నూతన వస్త్రాలు, అక్షింతలు, ప్రసాదం వితరణ గావించారు. ఈకార్యక్రమంలో ఆలయ అర్చకులు, ఉద్యోగులు, సిబ్బంది, భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.


Latest News
 

ర్యాపిడో గుడ్‌న్యూస్.. హైదరాబాద్‌తో సహా 4 నగరాల్లో 'ఫ్రీ రైడ్'.. కూపన్ కోడ్ ఇదే Mon, May 06, 2024, 09:48 PM
కాంగ్రెస్ నేత మధుయాష్కీకి తప్పిన ప్రమాదం.. 'అంతా భగవంతుడి దయ' Mon, May 06, 2024, 09:01 PM
మండు వేసవిలో చల్లని కబురు.. నేడు ఈ జిల్లాల్లో వర్షాలు Mon, May 06, 2024, 08:57 PM
ఎన్నికల్లో సిరా గుర్తు వేసే వేలు, చేతులు లేకపోతే ఏం చేస్తారో తెలుసా Mon, May 06, 2024, 08:53 PM
ఇంకో వారం ఉంది ఆ లెక్క ఎక్కడికెళ్తుందో.. మంత్రి కోమటిరెడ్డి వీడియోతో యాంకర్ శ్యామల సెటైరికల్ ట్వీట్ Mon, May 06, 2024, 08:00 PM