byసూర్య | Tue, Jul 05, 2022, 12:42 PM
క్వారీ నీటి గుంతలోపడి విద్యార్థి గల్లంతైన సంఘటన కొత్తూరు మండలం ఇన్ముల్నర్వ గ్రామ శివారులో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం. ఇన్ముల్నర్వ తండాకు చెందిన పాత్లావత్ శివ కుమారుడు చందూనాయక్ (16) మైసిగండిలోని ట్రైబల్ వెల్ఫేర్ గురుకుల పాఠశాలలో పదోతరగతి చదువుతున్నాడు. మధ్యాహ్నం గ్రామ సమీపంలోని క్వారీ పక్క నుంచి నడుచుకుంటూ వెళ్తుండగా ప్రమాదవశాత్తు కాలుజారి నీటిలో పడిపోయినట్లు తెలిసింది. సహాయం కోసం కొద్దిసేపు అరిచిన అతణ్ని సమీపంలోని కొంతమంది గమనించి దగ్గరికి వెళ్లగా. అప్పటికే మునిగిపోయాడు.
భారీ గుంతలు కావడంతో అందులోకి దిగేందుకు స్థానికులు సాహసించలేదు. నీటి లోపల పెద్ద బండరాళ్లు, మధ్యలో కంపచెట్లు ఉన్నాయని, అందులో ఇరుక్కునే అవకాశాలు ఉన్నట్లు భావిస్తున్నారు. సమాచారం అందుకున్న పోలీసు, అగ్నిమాపక శాఖ, డీఆర్ఎఫ్ సిబ్బంది గాలింపు చర్యలు చేపట్టారు. సంఘటనా స్థలంలో చందు కుటుంబీకుల రోదనలు మిన్నంటాయి. ప్రమాదవశాత్తు జరిగిందా. ఆత్మహత్యకు యత్నించాడా అనే కోణంలో దర్యాప్తు జరుపుతున్నట్లు పోలీసులు తెలిపారు.