byసూర్య | Tue, Jul 05, 2022, 12:03 PM
కుత్బుల్లాపూర్ నియోజకవర్గం, నిజాంపేట్ మునిసిపల్ కార్పొరేషన్ 1వ డివిజన్ పరిధిలోని బాచుపల్లి సిగ్నల్, మల్లంపేట్ రోడ్డు వద్ద నూతనంగా ఏర్పాటు చేసిన క్రాంప్టన్ సిగ్నేచర్ స్టూడియోను ఈరోజు డిప్యూటీ మేయర్ ధనరాజ్ యాదవ్ గారు ముఖ్య అతిథులుగా పాల్గొని స్థానిక కార్పొరేటర్ విజయలక్ష్మి సుబ్బారావు గారితో కలిసి ప్రారంభించారు. అనంతరం డిప్యూటీ మేయర్ ను మరియు కార్పొరేటర్, సీనియర్ నాయకులను నిర్వాహకులు ఘనంగా సన్మానించారు.ఈ కార్యక్రమంలో సీనియర్ నాయకులు ఆవుల జగన్ యాదవ్,యువ నాయకులు ఆనంద్ రెడ్డి,యజమానులు మరియు వారి కుటుంబ సభ్యులు,తదితరులు పాల్గొన్నారు.