byసూర్య | Tue, Jul 05, 2022, 11:45 AM
బల్కంపేట ఎల్లమ్మ కల్యాణ మహోత్సవం నేడు జరుగనున్నది. మూడు రోజుల పాటు జరిగే వేడుకలను వైభవోపేతంగా నిర్వహించేందుకు దేవస్థానం ఏర్పాట్లు చేసింది. ఉత్సవాల్లో భాగంగా ఇవాళ ఉదయం కల్యాణ క్రతువు జరుగనుండగా. బుధవారం అమ్మవారి రథోత్సవం నిర్వహించనున్నారు. ప్రభుత్వం తరఫున అమ్మవారికి దేవాదాయశాఖ మంత్రి ఇంద్రకరణ్రెడ్డితో పాటు మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ పట్టువస్త్రాలు సమర్పించనున్నారు. అమ్మవారి కల్యాణ మహోత్సవ వేడుకల సందర్భంగా పోలీస్శాఖ భారీ బందోబస్తు ఏర్పాటు చేసింది.