byసూర్య | Tue, Jul 05, 2022, 11:47 AM
తెలంగాణ రాష్ట్రంలో కొత్తగా 21,918 మందికి కరోనా పరీక్షలు నిర్వహించగా, 443 కరోనా కేసులు నమోదయ్యాయి. గత 24 గంటల్లో 493 మంది కరోనా నుంచి కోలుకున్నారు. ఈరోజు రాష్ట్రంలో కరోనా మరణాలు సంభవించలేదు. రాష్ట్రంలో ప్రస్తుతం 4,697 యాక్టివ్ కేసులు ఉన్నాయి. రికవరీ రేటు 98.90 శాతం. హైదరాబాద్ జిల్లాలో 247, మేడ్చల్ మల్కాజ్ గిరిలో 30, రంగారెడ్డిలో 34, సంగారెడ్డిలో 27, ఖమ్మంలో 12, ములుగు జిల్లాలో 15 కరోనా కేసులు నమోదయ్యాయి.