ఖైరతాబాద్లో బస్సు బీభత్సం
byసూర్య |
Tue, Jul 05, 2022, 11:50 AM
ఖైరతాబాద్ ఆర్టీఏ కార్యాలయం వద్ద ఓ ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు బీభత్సం సృష్టించింది. మంగళవారం ఉదయం కర్ణాటక నుంచి హైదరాబాద్ వస్తున్న బస్సు అతివేగంతో అదుపుతప్పి రోడ్డు డివైడర్ను ఢీకొని ఆపై డివైడర్ పైకి ఎక్కింది. ప్రమాద సమయంలో బస్సులో 40 మంది ప్రయాణికులు ఉన్నారు. కాగా ఈ ఘటనలో ఎవరికి ఎటువంటి గాయాలు కాకపోవడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. ప్రమాదం కారణంగా ఖైరతాబాద్లో భారీగా ట్రాఫిక్ జామ్ అయ్యింది.
Latest News