byసూర్య | Tue, Jul 05, 2022, 11:42 AM
రైళ్ల పునరుద్ధరణకు దక్షిణ మధ్య రైల్వే గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఇటీవల రద్దు చేసిన 13 రైళ్లను పునరుద్ధరిస్తూ టైం టేబుల్ను ఖరారు చేసింది. విజయవాడ-గూడూర్, గూడూర్-విజయవాడ, నిజామాబాద్-నాందేడ్, నాందేడ్-విజయవాడ, విజయవాడ-తెనాలి, తెనాలి-విజయవాడ, కర్నూల్ సిటీ-నంద్యాల, నంద్యాల-కర్నూల్ సిటీ, గుంటూరు-విజయవాడ, విజయవాడ-గుంటూరు, విజయవాడ-ఒంగోలు, ఒంగోలు-విజయవాడ మధ్యలో నడిచే రైళ్లను తిరిగిపునరుద్ధరించారు. వారంతపు రోజుల్లో నడిచే నాందేడ్-పుణె(నెంబరు17630), పుణె-నాందేడ్ (నెంబరు17629) ఎక్స్ప్రెస్ రైళ్లను రోజూ నడపనున్నారు. నాందేడ్లో సాయంత్రం 15. 55 బయలుదేరి మరుసటి రోజు ఉదయం. 5. 30 గంటలకు పుణె చేరుకుంటుంది. పుణెలో రాత్రి 21. 35 బయలుదేరి మరుసటి రోజు ఉదయం 10. 20 గంటలకు నాందేడ్కు చేరుకుంటుంది.