byసూర్య | Tue, Jul 05, 2022, 10:46 AM
హైదరాబాద్: జూబ్లీహిల్స్ మాజీ ఎమ్మెల్యే విష్ణువర్దన్ రెడ్డి ఇంట్లో టీ కాంగ్రెస్ నేతలు లంచ్ మీట్ జరగనుంది. సీఏల్పీ నేత భట్టి విక్రమార్క, సీనియర్ నేతలు వీహెచ్, జగ్గారెడ్డి, మధుయాష్కీ, మర్రి శశిథర్ రెడ్డితో పాటు పలువురు నేతలకు ఆహ్వానం అందింది. ఇటీవల పీజేఆర్ కూతురు తన సోదరి అయిన విజయారెడ్డిని పార్టీలో చేర్చుకోవడంపై విష్ణువర్దన్ రెడ్డి అసంతృప్తి వ్యక్తం చేశారు. విష్ణువర్ధన్ రెడ్డి బీజేపీ వైపు చూస్తున్నారని ప్రచారం జరిగింది. ఈ నేపథ్యంలో విష్ణువర్దన్ రెడ్డి ఇంట్లో భేటీపై ఆసక్తి చోటు చేసుకుంది