byసూర్య | Sun, Jul 03, 2022, 09:51 PM
తెలంగాణ సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్స్లో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ఉత్తరప్రదేశ్ సీఎం యోగి ఆదిత్యనాథ్ మాట్లాడారు.... తెలంగాణ రాష్ట్రంలో బీజేపీ ప్రభుత్వం వస్తుంది అని తెలిపారు. తెలంగాణలో టీఆర్ఎస్ ప్రభుత్వం ఒక్క కేంద్ర పథకాన్ని కూడా సక్రమంగా అమలు చేయడం లేదు. ప్రతి కేంద్ర పథకాన్ని రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్నట్టుగా ముద్ర వేస్తోందని ఆరోపించారు.ప్రధాని మోదీ నాయకత్వంలో దేశంలో వచ్చిన మార్పులు అందరి కళ్ల ముందు కనిపిస్తున్నాయన్నారు. ప్రధాని మోదీ అయోధ్యలో రామమందిర నిర్మాణాన్ని ప్రారంభించి, కాశీలో విశ్వనాథ ఆలయ నిర్మాణాన్ని పూర్తి చేశారు అని తెలిపారు.