బాసర ట్రిపుల్ ఐటీ నోటిఫికేషన్ విడుదల!
byసూర్య |
Fri, Jul 01, 2022, 11:41 AM
నిర్మల్ జిల్లా బాసరలోని రాజీవ్గాంధీ వైజ్ఞానిక సాంకేతిక విశ్వవిద్యాలయం (ఆర్జీయూకేటీ-ట్రిపుల్ ఐటీ)లో 2022-23 సంవత్సరానికిగాను గురువారం ప్రవేశ నోటిఫికేషన్ విడుదలైంది. జూలై 1 నుంచి 15వ తేదీ వరకు ఆన్లైన్లో దరఖాస్తులు స్వీకరించనున్నారు. దరఖాస్తు చేసుకున్న విద్యార్థులు తమ సర్టిఫికెట్ జిరాక్స్ కాపీలను జూలై 19లోగా యూనివర్సిటీకి పంపాల్సి ఉంటుంది. ఎంపికైన విద్యార్థుల జాబితాను జూలై 30న ప్రకటించనున్నట్లు యూనివర్సిటీ డైరెక్టర్ సతీష్ కుమార్ ఓ ప్రకటనలో తెలిపారు. పదో తరగతి పూర్తి చేసిన విద్యార్థులు ట్రిపుల్ ఐటీలో ప్రవేశం పొందవచ్చు. ఒక్కసారి ఎంపికైతే ఎలాంటి ఫీజులేకుండా ఇంజనీరింగ్ కోర్సు పూర్తి చేసుకోవచ్చు. విద్యార్థులకు భోజనం, యూనిఫామ్స్తోపాటు ల్యాప్టాప్ వంటివి ప్రభుత్వమే ఉచితంగా అందిస్తుంది. ప్రతి సంవత్సరం 1500మందికి ప్రవేశం కల్పిస్తున్నారు. ఈసారి మాత్రం ఎంత మంది విద్యార్థులకు ప్రవేశం కల్పించేది ట్రిపుల్ ఐటీ అధికారులు తెలియజేయలేదు.
Latest News