byసూర్య | Fri, Jul 01, 2022, 10:12 AM
సిఎం సహాయనిధి నిరుపేద లకు ఒక వరంలాంటిదని ఉప్పల్ ఎమ్మెల్యే బేతి సుభాష్ రెడ్డి పేర్కొన్నారు. ఈ మేరకు గురువారం చిలుకానగర్ డివిజన్కు చెందిన పలువురు లబ్దిదారులకు సిఎం సహాయనిధి చెట్లు అందజేశారు. అనంతరం జరిగిన కార్యక్రమంలో ఎమ్మెల్యే మాట్లాడుతూ సిఎం సహాయనిధి పథకానికి అర్హులైన పేదలు దరఖాస్తు చేసుకోవాలని, వారికి ప్రభుత్వం నుంచి చేయూత అందిస్తున్నామన్నారు. ఈ సందర్భంగా డివిజన్కు చెందిన శాంతిదేవికి రూ. 60వేలు, రజనీకి రూ. 60 వేలు చెట్లు అందజేశారు. కార్యక్రమంలో నాయకులు బన్నాల ప్రవీణ్ ముది రాజ్, పల్లె నర్సింగ్ రావు, గరిక సుధాకర్, పలువురు నేతలు పాల్గొన్నారు.