byసూర్య | Fri, Jul 01, 2022, 08:57 AM
ములుగు జిల్లా వాజేడు మండలంలో రెండు ద్విచక్ర వాహనాలు ఢీకొన్న ఘటన గురువారం సాయంత్రం చోటు చేసుకుంది. వాజేడు మండలంలోని జాతీయ రహదారిపై రెండు ద్విచక్ర వాహనాలు ఎదురెదురుగా ఢీకొన్నాయి.
ఈ ప్రమాదంలో వాజేడుకు చెందిన ఇద్దరు యువకులకు తీవ్ర గాయాలు కాగా వారిని 108 వాహనం ద్వారా ఏటూరునాగారం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.