byసూర్య | Fri, Jul 01, 2022, 10:13 AM
ఉప్పల్ ఎమ్మెల్యే భేతి సుభాష్ రెడ్డి మంత్రి కల్వకుంట్ల తారక రామారావును గురువారం మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా మంత్రి రానున్న వర్షాకాలం దృష్టి అప్రమత్తంగా ఉండి ప్రజలకు సేవలు అందించాలని ఎమ్మెల్యేలకు సూచించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యేలు అరికె పూడి గాంధీ, మాగంటి గోపీనాథ్, సాయన్న, మాజీ కార్పొరేటర్లు కొత్త రామారావు, సింగిరెడ్డి దనపాల్ రెడ్డి, ఏఎస్ రావు నగర్ డివిజన్ టిఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు కాసం మహిపాల్ రెడ్డి, టిఆర్ఎస్ సీని యర్ నాయకులు గరిక సుధాకర్ తదితరులు పాల్గొన్నారు.