byసూర్య | Fri, Jul 01, 2022, 08:47 AM
రాష్ట్ర ప్రభుత్వం రైతుల పెట్టుబడి కోసం అందిస్తున్న రైతు బంధు పెట్టుబడి సహాయాన్ని పోస్ట్ ఆఫీసుల ద్వారా ఇంటి వద్దనే పంపిణీ చేయనున్నట్లు పెద్దపల్లి డివిజన్ పోస్టల్ సూపెరింటెండెంట్ జె. పండరి తెలిపారు. ఏ బ్యాంకు నందు ఖాతా కలిగి ఉన్నా, రైతులు తమ ఆధార్ నంబర్ ద్వారా రోజుకు 10 వేల చొప్పున అందించనున్నట్లు పేర్కోన్నారు.
రైతులు తమ పనులు మానుకొని నగదు కొరకు దూర ప్రాంతాల్లో ఉన్న బ్యాంకులకు వెళ్లి ఇబ్బంది పడకుండా పోస్ట్ ఆఫీస్ ద్వారా ఎలాంటి చార్జీలు లేకుండా ఇంటి వద్దనె సంబంధిత బ్రాంచ్ పోస్ట్ మాస్టర్/ డాక్ సేవక్ మైక్రో ఏటిఎంల ద్వారా నగదు పంపిణీకి ఏర్పాట్లు చేసినట్లు తెలిపారు. తపాలా శాఖ అందిస్తున్న ఈ సేవను తమ గ్రామంలోని పోస్ట్ ఆఫీసులో ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.