అనుమానాస్పద స్థితిలో ఓ యువకుడు రైలు కింద పడి మృతి

byసూర్య | Tue, May 17, 2022, 04:41 PM

అనుమానాస్పద స్థితిలో ఓ యువకుడు రైలు కింద పడి మృత్యువాత పడిన ఘటన మాసాయిపేట మండలం బొమ్మారం రైల్వే గేటు సమీపంలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే ప్రముఖ దినపత్రికలో తెలిపిన వివరాల మండలంలోని నాగ్‌సాన్‌పల్లి గ్రామానికి చెందిన అట్టెం ప్రవీణ్‌కుమార్‌ (22) తండ్రి యాదగిరితో కలిసి వ్యవసాయం చేసుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. ఇతడి తల్లి శ్యామల గతంలో మృతిచెందింది. దీంతో తండ్రి రెండో వివాహం చేసుకున్నాడు. ప్రవీణ్‌కుమార్‌ ఆదివారం ఇదే గ్రామానికి చెందిన ఓ మిత్రుడి ఇంట్లో జరిగిన జన్మదిన వేడుకల్లో పాల్గొన్నాడు. సోమవారం తెల్లవారుజాము 2.30 గంటల సమయంలో ద్విచక్ర వాహనంపై వెళ్లిపోయాడు. సోమవారం ఉదయం 7 గంటలకు ప్రవీణ్‌కుమార్‌ విగతజీవిగా బొమ్మారం రైల్వేగేటు, బంగారమ్మ ఆలయం మధ్యన రైలు పట్టాలపై రైల్వే సిబ్బందికి కనిపించాడు. సమాచారం అందుకున్న కామారెడ్డి రైల్వేపోలీసులు ఘటనాస్థలికి చేరుకొని పరిశీలించారు. విషయం తెలుసుకున్న కుటుంబసభ్యులు అక్కడికి చేరుకొని రోదించారు. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని కామారెడ్డి ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. తెల్లవారుజాము 3 నుంచి 4 గంటల మధ్య ఈ ఘటన జరిగి ఉంటుందని రైల్వే పోలీసులు భావిస్తున్నారు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు అనుమానాస్పద స్థితిలో మృతిగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టామని రైల్వేపోలీసులు వివరించారు.

Latest News
 

గులాబీ పార్టీ చరిత్రలో ఇదే తొలిసారి.. కేసీఆర్ ఫ్యామిలీ నుంచి ఒక్కరు కూడా లేరు Fri, Apr 26, 2024, 08:37 PM
కేఏ పాల్ కాఫీకి రమ్మంటే వెళ్లా,,కండువా కప్పి పార్టీ అధ్యక్షుడి పదవి ఇచ్చారు Fri, Apr 26, 2024, 08:33 PM
రైతులకు రుణమాఫీ చేయలేకపోతే మాకు అధికారమెందుకు,,,హరీశ్ రాజీనామా లేఖ సిద్ధంగా పెట్టుకో Fri, Apr 26, 2024, 08:27 PM
హైదరాబాద్ బీజేపీ ఎంపీ అభ్యర్థి మాధవీలతపై రేణు దేశాయ్ ఇంట్రెస్టింగ్ పోస్ట్ Fri, Apr 26, 2024, 08:23 PM
వికారాబాద్‌ యువకుడికి సివిల్స్‌ ర్యాంక్.. ఘనంగా సన్మానాలు, చివరికి షాకింగ్ ట్విస్ట్ Fri, Apr 26, 2024, 08:19 PM