byసూర్య | Tue, May 17, 2022, 08:58 AM
మంచిర్యాల రైల్వే స్టేషన్ లోని పుట్ ఓవర్ బ్రిడ్జ్ పై సోమవారం గుర్తుతెలియని వ్యక్తి మృతి చెందాడు. మృతుని వయస్సు 45 సంవత్సరాల వరకు ఉండగా, కుడి ఛాతిపై పుట్టుమచ్చ కలిగి, కుడికాలు మోకాలు వరకు లేదు. ఒంటిపై నషం రంగు నలుపు గడుల రెడీమేడ్ ఫుల్ షర్టు, నలుపు రంగు ప్యాంటు ధరించి ఉన్నాడు. మృతుడిని యాచకుడిగా భావిస్తున్నారు. మృతుని వివరాలు తెలిసిన వారు 9440900792, 8328512176 నంబర్లకు సమాచారం అందించాలని జీఆర్పీ హెడ్ కానిస్టేబుల్ కెంసారం సంపత్ తెలిపారు.