byసూర్య | Tue, May 17, 2022, 08:55 AM
నిర్మల్ జిల్లా దిలావర్ పూర్ మండల కేంద్రానికి చెందిన శివరాత్రి సాయినాథ్ (35) అనే వ్యక్తి అదృశ్యమైనట్లు ఎస్సై గంగాధర్ తెలిపారు. ఆయన తెలిపిన వివరాల ప్రకారం. గ్రామానికి చెందిన సాయినాథ్ శనివారం పంట చేనుకు వెళ్తున్నాను చెప్పి ఇంటికి రాలేదు. కుటుంబ సభ్యులు బంధువుల ఇళ్లలో వాకబు చేసిన ఆచూకీ లభించకపోవడంతో పోలీస్ స్టేషన్ లో సోమవారం ఫిర్యాదు చేశారు. ఈ మేరకు అదృశ్యం కేసు నమోదు చేసినట్లు ఎస్సై పేర్కొన్నారు.