byసూర్య | Tue, May 17, 2022, 08:56 AM
అకాల వర్షంతో తడిసిపోయిన వరి ధాన్యాన్ని కాపాడుకునే విషయంలో వ్యవసాయ శాఖ అధికారులు సలహాలు ఇవ్వాలని ఖానాపూర్ నియోజకవర్గంలోని పలు మండలాల రైతులు కోరుతున్నారు. మొన్న అర్ధరాత్రి తర్వాత అకాల వర్షం పడి పలు మండలాల్లో పొలాలు, కొనుగోలు కేంద్రాల వద్ద ఆరబోసిన ధాన్యం పూర్తిగా తడిసిపోయిందని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ధాన్యం కుప్పలలో నిలిచిపోయిన నీటిని తొలగిస్తున్నామని, ఆలస్యమైతే ఆ ధాన్యం మొలకెత్తే ప్రమాదముందని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తడిసిపోయిన వరి ధాన్యాన్ని కొంతవరకైనా కాపాడుకునేందుకు వ్యవసాయ అధికారులు తమకు సలహాలు ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. అలాగే ప్రభుత్వం కూడా ముందుకు వచ్చి తడిసిన ధాన్యాన్ని కొనుగోలు చేయాలని రైతులు కోరుతున్నారు.